బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్న- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది ధర్మంగాంధ రాజు అనే దంపతులకు వందమంది పుత్రులు జన్మించి వారు మరణిస్తూ ఉండడం సంభవించింది ఇట్టి తరుణంలో ఆ మహారాజు ఆదిపరాశక్తి అమ్మవారిని వేడుకుంటూ ఉంటే ఆ వందమంది పుత్ర సంతానం తర్వాత ఆడపడుచు జన్మిస్తుంది. ఈ యొక్క ఆడపడుచు సురక్షితంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆ యొక్క మహారాజు మునీశ్వరులను అందరినీ పిలిచి ఆశీర్వదించమని కోరగా మునీశ్వరులు అందరూ ఆ ఆడపడుచుని నువ్వు నిండు నూరేళ్లు బతుకమ్మ అని దీవించగా ఆ రోజు నుండి ఆమె యొక్క నామకరణ దినోత్సవంను బతుకమ్మ పండుగగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ ప్రజలకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కార్యాలయ సిబ్బంది , కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *