6వ వార్డ్ కౌన్సిలర్ గా బాసిపంగు లక్ష్మీ ప్రసన్న గోపి నామినేషన్
డోర్నకల్ ప్రతినిది జనవరి 30 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాసిపంగు లక్ష్మీ ప్రసన్న గోపి,నామినేషన్ దాఖలు చేశారు. గురువారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి వారి నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తనే డోర్నకల్ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఆరో వార్డ్ ప్రజలు తమను కౌన్సిలర్ గా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.