ఏపీలోలో గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ ఎస్సై, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. స్కేల్ ఆఫ్ పే, వయసు, విద్యార్హతలు అన్నీ ఏపీపీఎస్సీలో పొందుపర్చారు. DEC 21 నుంచి జనవరి 10, 2024 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.