నేడు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ..

Spread the love

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టీస్ బోస్, జస్టీస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.17-ఏ పై వీరిద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో సీబీఎన్ బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *