భారత అత్యున్నత న్యాయస్థానం 75 పడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ వజ్రోత్సవంలో పౌర కేంద్రీకృత సమాచారాన్ని, డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్టు, డిజిటల్ కోర్టు 2.0, కొత్త వెబ్సైట్, తదితర సాంకేతిక వినూత్న ఆవిష్కరణలను ప్రధాని ప్రారంభించి ప్రసంగిస్తారు.