తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రేపు (సోమవారం) ఝార్ఖండ్ వెళ్లే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్లో కొనసాగుతోంది. యాత్రలో పాల్గొనేందుకు రేవంత్రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తరవాత సీఎం పర్యటనపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.