తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సభలో తీర్మానం ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. రేపు అసెంబ్లీ, కౌన్సిల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సోమవారం బడ్జెట్పై సాధారణ చర్చ నిర్వహిస్తారు.