తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేఆర్ఎంబీ అంశంపై బీఆర్ఎస్ చలో నల్గొండ అంటుంటే దీనికి కౌంటర్ గా మేడిగడ్డ టూర్ కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను నిపుణుల ద్వారా వివరించేందుకు సిద్ధమైంది.