రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

Spread the love

రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా సాయి ప్రసాద్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

 

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయి ప్రసాద్‌ను ఎన్‌ఐఏ విచారణకు తీసుకువెళ్లింది. గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఓ మొబైల్ స్టోర్‌తో పాటు ఇద్దరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.

 

మరోవైపు కర్ణాటకలో సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై కాంగ్రెస్‌ బీజేపీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని కాషాయ మద్దతుదారులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు.

 

కాగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *