ఈనెల 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్: ఈసీ

Spread the love

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ తేదీన విడుదల చేస్తామన్నది తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీంతో పాటుగా నామినేషన్లు, వాటి ఉపసంహరణ తేదీలను కూడా ప్రకటించారు.

 

18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఏపీ సీఈఓ మీనా తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు.

 

రాష్ట్రంలో మే 13న నిర్వహించే ఎన్నికలు.. పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *