ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంపై చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇవి హిస్టారికల్ ఎన్నికలని, ఇలాంటి ఎన్నికలను తన రాజకీయ జీవితంలో చూడలేదని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఎన్నికలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.