మంగళగిరిలో లోకేష్ ప్రజా దర్బార్..!

Spread the love

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తక్షణ కర్తవ్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. మంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో కూడా నిర్వహించాలని వివిధ జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలో నాలుగు రోజులుగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.

 

ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పారా మెడికల్, ఆర్‌ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి తరహాలోనే తమ జిల్లాల్లో నేతలు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చే సమస్య ఉండదని చెబుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్‌కు తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

 

ప్రజా దర్బార్‌కు వస్తున్న వారికి మంత్రి లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న లోకేష్ ప్రజా దర్బార్‌కు ప్రజలతో పాటు, పలువురు ఉద్యోగులు, మీ సేవా నిర్వాహకులు సైతం వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *