*భూపాలపల్లి మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*
స్టేట్ బ్యూరో ఆగష్టు 27 (సంచలన వార్త)
భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో వరంగల్ ఏసీబీ డి.ఎస్.పి సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూపాలపల్లి, హైదరాబాద్బో డుప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జయరాజ్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దోపిడీ దారులతో చేతులు కలిపారని ఆరోపణలు ఉన్నాయి.
సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు.