గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. వ్యవసాయం,విద్య, ఆరోగ్యం వంటి రంగాలపై డిజిటలైజేషన్ లో భాగస్వాములమవుతామని తెలిపారు.