మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగ వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.