రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో బుధవారం ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ధరణి కమిటీ ముందున్న అన్ని సందేహాలను నివృత్తి చేసుకోనుంది. రిజిస్ట్రేషన్ శాఖ అదనపు ఇన్ స్పెక్టర్ జనరల్ సుభాషిణి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ రావు, సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావులు హాజరు కానున్నారు. ధరణి కమిటీ నుంచి కోదండరెడ్డి, రేమండ్ పీటర్, మధుసూధన్, సీఎమ్మార్వో లచ్చిరెడ్డి హాజరవుతారు.