తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం కార్గో సర్వీసులను విస్తరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్గోలో 20 శాతం సేవలను ఆర్టీసీ ద్వారా అందించడమే లక్ష్యమన్నారు. కార్గోకు కొత్త వాహనాలను సమకూరుస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు వాహనాలను తనిఖీ చేయిస్తామని చెప్పారు