త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం 4,76,220 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 6తో గడువు తేదీ ముగిసినా ఆన్లైన్లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆలస్యంగా వచ్చినవాటిపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనుంది. అనంతరం ఈనెల 24న ఓటరు ముసాయిదా జాబితా, ఏప్రిల్ 4న పట్టభద్రుల తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది