తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా, ఇవాళ పలువురు BRS నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ ZP ఛైర్పర్సన్ సునీత సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ MLA తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి ZP ఛైర్పర్సన్ తీగల అనిత, GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.