అశ్లీల వీడియోలపై తీవ్ర వివాదంలో ఉన్న కర్ణాటకకు చెందిన JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నా విషయం తెలిసిందే. అతను బెంగళూరు వెలుపల ఉన్నానని పేర్కొంటూ తన కేసును నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి ఏడు రోజుల సమయం కోరారు.
విచారణ బృందానికి తన నోటీసును పంచుకుంటూ, ప్రజ్వల్ ట్విట్టర్లో, “సత్యం త్వరలో గెలుస్తుంది” అని అన్నారు. కాగా రేవణ్ణ ఈ వీడియోల విషయంపై స్పందించడం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్కు సంబంధించిన పలు అశ్లీల వీడియోలు వైరల్ కావడంతో ఏప్రిల్ 26న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు పారిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ ఎంపీ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం నోటీసు జారీ చేసింది. విచారణ కోసం సిట్ ముందు హాజరుకావాలని కోరింది.
విచారణ బృందానికి ఇచ్చిన నోటీసులో ప్రజ్వల్ తరపు న్యాయవాది ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు వెలుపలు ఉన్న కారణంగా విచారణ బృందం ముందు హాజరుకావటానికి ఏడు రోజుల సమయాన్ని కోరారు.