సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి..

Spread the love

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. అయితే జగన్ లండన్,

స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కోర్టును కోరింది.

 

అయితే ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని సీఎం జగన్ ను ఆదేశించింది. విదేశాలకు వెళ్లడం కోసం సీబీఐ కోర్టులో సీఎం జగన్ వారం క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి వెంట వెళ్లనున్నారు. అయితే జగన్ పై పలు కోర్టుల్లో కేసులు ఉండటంతో విదేశాలకు వెళ్లకుండా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *