రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఓట్లు పడతాయనుకున్న చోట్లా టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయన్నారు. అయినా వైసీపీ నేతలు సంయమనం పాటిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.