కాకరేపుతున్న సజ్జల తాజా కామెంట్స్..!

Spread the love

ఏపీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా కౌంటింగ్ సమయంలో ప్రత్యర్థుల ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహంచారు. ఈ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అవతలి పార్టీ ఆటలు సాగనివ్వద్దని తెలిపారు. మరో సారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదని తెలిపారు.

 

ఇదిలా ఉంటే..చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కు మెయిల్ ద్వారా వైసీపీ రిక్వెస్ట్ పంపించింది. వైసీపీ రాజ్య సభ సభ్యులు నిరంజన్ రెడ్డి ఈ మెయిల్ పంపించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25 న ఇచ్చిన నిబంధనలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. అటెస్టిండ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నీచర్ తీసుకోవడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

 

కొత్త నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని ఎన్నికల కమిషన్ ను కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *