చైతూ ల్యాండ్ మార్క్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..! ఎవరంటే..?

Spread the love

అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌లో మైలురాయి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆయన 25వ చిత్రానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గతంలో నాగ చైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమై ఉందని, దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ ప‌నుల్లో బిజీగా ఉన్నారని తెలిసింది. ‘మజిలీ’ తర్వాత నాగ చైతన్య, శివ నిర్వాణ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

ఈ చిత్రాన్ని హృద్యమైన, భావోద్వేగభరితమైన యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ ఏడాది చివరి నాటికి సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో 25వ సినిమా కావడం, విజయవంతమైన కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *