చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు..

Spread the love

బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనుందని చిరంజీవి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నటుడిగా బాలయ్య 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరినీ పెట్టి సినిమా తీయాలని దర్శకుడు బోయపాటికి కూడా చిరంజీవి సవాల్ విసిరారు.

 

ఈ అంశంపై తాజాగా బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు, బాలయ్యలని ఎదురుగా పెట్టుకుని వారి కోసం కథ రాయకపోతే వేస్ట్ అని ఆయన అన్నారు. ఆ సినిమాకు టైటిల్ కూడా ‘వారిద్దరే’నని చెప్పారు. బోయపాటి వ్యాఖ్యలు చూస్తుంటే… సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *