ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటువేసే అవకాశం కోల్పోవద్దు..సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పిలుపు

Spread the love

ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది దేశ ప్రజలందరి కర్తవ్యమని గుర్తు చేశారు.

 

2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ విషన్ కు ఆయన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మన దేశం అని.. మన రాజ్యాంగం దేశంలోని పౌరలందిరికీ అనేక హక్కులను కల్పించిందన్నారు.

 

దేశంలోని ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన ఓటు అనే కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. దేశ పౌరలకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ముఖ్యమైనది ఓటు వేయడమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దేశ పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు వేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకోవద్దని అభ్యర్థించారు.

 

ప్రతి ఒక్కరు ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించి.. గర్వంగా ఓటు వేయాలని సీజేఐ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదు నిమిషాలు లైన్ లో నిల్చుని ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులదే అతి పెద్ద పాత్ర అని.. అందుకే మన రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు అని రాసి ఉందన్నారు.

 

ఈ తరుణంలో తాను సారిగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందని వెల్లడించారు. న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నా సరే.. ఓటు వేసే కర్తవ్యాన్ని ఎప్పుడూ మరిచిపోలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *