హైదరాబాద్‌లో డబ్బే డబ్బు, ఒక్క రోజే రెండు కోట్లు సీజ్..

Spread the love

పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో పోలీసులు అలర్టయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతోపాటు పోలీసులు సోదాలు తీవ్రం చేశారు. కొద్దిరోజులుగా నేతలు ఎవరూ ప్రచారంలోకి దిగకపోవడంతో సైలెంట్ అయ్యారు. తాజాగా సోమవారం ఒక్కరోజు సైబరాబాద్ పరిధిలో దాదాపు రెండు కోట్ల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు.

 

సైబరాబాద్ పరిధిలో ఎస్ఓటీ టీమ్స్ తమ సిబ్బందితో కలిసి 8 ప్రదేశాల్లో దాదాపు కోటి 96 లక్షల రూపాయలను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మనీని సీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రతీ ఏరియాలోనూ పోలీసులు భారీ మొహరించారు. కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణికుల బ్యాగులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

 

బషీరాబాద్‌- 74 లక్షలు, కొత్తూరు పోలీసుస్టేషన్ పరిధి- 34 లక్షలు, మాదాపూర్‌ – 21 లక్షలు, చందానగర్‌- 19 లక్షలు, రాజేంద్రనగర్- 15లక్షలు, నార్సింగ్-11 లక్షలు, బాలానగర్- 5లక్షలు మోకిల పోలీసుస్టేషన్ పరిధిలో ఓ కారులో సోదాలు చేస్తుండగా దాదాపు 15 లక్షలు రూపాయలు పట్టబడ్డాయి. పోలింగ్ అయ్యేనాటికి భారీగా నగదు పట్టుబడవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *